తెలంగాణలో అవినీతి పెరిగింది... ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: దిగ్విజయ్​ సింగ్​

తెలంగాణలో అవినీతి పెరిగింది... ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: దిగ్విజయ్​ సింగ్​

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని  దిగ్విజయ్‌ సింగ్‌ వెల్లడించారు... అన్ని వర్గాల బాగు కోసమే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు..కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు.. మధ్యప్రదేశ్‌లో మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలనూ అమలు చేశాం.. రాజస్థాన్, చత్తీస్ గఢ్, కర్ణాటకల్లో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేశాం.. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకూ సమ న్యాయం జరిగేలా, వారి బతుకులు బాగుపడేలా అంబేద్కర్ హక్కులు కల్పించారు.. 

బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని  బలహీనపరుస్తున్నదని దిగ్విజయ్​ సింగ్​ అన్నారు.. పేదరికం, నిరుద్యోగం భారీగా పెరుగుతున్నది.. రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితే ఉన్నది.. ఎవరూ సంతోషంగా లేరు.. రైతులు, నిరుద్యోగులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు.. పేపర్ లీకులతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారు.. ఉద్యోగాలు కల్పించలేదు.. 26/11 దాడుల్లో మరణించిన వారికి నివాళులు.. రాముడు అందరివాడు.. అందరికీ ప్రియమైనవాడు.. అందులో రాజకీయాలేమీ లేవు.‌. కానీ, బీజేపీ మాత్రం దర్మం పేరిట దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నది.. విభజన రాజకీయాలకు మేము పూర్తిగా వ్యతిరేకం. ” అని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఓఆర్‌ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు. ఐటీలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతున్నదంటే దానికి కారణం వైఎస్ విజన్, ఆయన నిర్ణయాలేనన్నారు.   హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందిందన్నారు.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఐటీ సెక్టార్ నుంచే వస్తున్నాయన్నారు. 

రాష్ట్ర విభజన హామీల్లో ఇంకా  ప్రాజెక్టులను అమలు చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే  ఫుల్‌ఫిల్ చేస్తామని దిగ్విజయ్​ సింగ్​ అన్నారు.  కౌలు రైతులకు న్యాయం జరగడం లేదు.. వారికీ రైతు భరోసాను అందజేస్తాం.. వరికి బోనస్ ఇస్తాం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది.